కొల్చారం మండలం రంగంపేటలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు, గన్ని బ్యాగులు, హమాలీల కొరతతో రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం రోజుల తరబడి అక్కడే ఉండిపోవడంతో రైతులు రాత్రింబవళ్లు కాపలా కాస్తున్న పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి గ్రామానికి లారీలు కేటాయించాలని కోరారు.