నూతన సంవత్సరం 2026 సందర్భంగా తూప్రాన్ ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఏడాది తొలి రోజు కావడంతో ఆలయాల దర్శనాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు మహిళలు, పాఠశాల సెలవుల కారణంగా విద్యార్థులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో బస్టాండ్ ఆవరణ అంతా సందడిగా మారింది.