చిలిపిచేడ్ మండల కేంద్రంలో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడిన రెండు ట్రాక్టర్లను ఇటీవల సీజ్ చేయగా, వాటిలోని ఇసుకను గురువారం రెవెన్యూ శాఖ బహిరంగ వేలానికి పెట్టింది. తహశీల్దార్ సహదేవ్, ఎస్ఐ నర్సింలు పర్యవేక్షణలో జరిగిన ఈ వేలంలో ఒక గ్రామస్తుడు రూ. 5,500లకు ఇసుకను దక్కించుకున్నారు. అక్రమ ఇసుక రవాణాను ఉపేక్షించబోమని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.