AP: మన్యం జిల్లా పార్వతీపురంలో ఏఎన్ఎం, ఆశా వర్కర్ తమ కర్తవ్యనిబద్ధతను చాటుకున్నారు. సాలూరు మండలంలోని తోనాం పీహెచ్సీ పరిధిలో భారీ వర్షాల కారణంగా ఏరు ఉధృతంగా ప్రవహించినా, వెనకడుగు వేయని ఏఎన్ఎం సావిత్రి, ఆశా వర్కర్తో కలిసి ఏరుదాటి గర్భిణీలకు సమయానికి టీకాలు వేశారు. వైద్యాధికారి అజయ్ వారిని అభినందించారు.