ఫుట్బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సీ భారత పర్యటనలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. పొగమంచు కారణంగా విమానం ఆలస్యమైనప్పటికీ, ఆయన హోటల్లో నిర్వాహకులు ఏర్పాటు చేసిన 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో పలువురు కార్పొరేట్లు, వీఐపీలు పాల్గొన్నారు. మెస్సీని కలవడానికి, హ్యాండ్షేక్ కోసం కొందరు కార్పొరేట్లు రూ. కోటి వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. గతంలో కోల్కతా, హైదరాబాద్, ముంబై నగరాలను మెస్సీ సందర్శించారు.