TG: రాష్ట్రంలో భూ క్రయవిక్రయాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రూపొందించిన ‘ఇంటిగ్రేటెడ్ భూభారతి’ పోర్టల్ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం మిఠాయిపల్లిలో మంత్రి పర్యటిస్తున్నారు. తమది ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వమని అన్నారు. ఈ నెలాఖరులో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరుగుతుందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసి చూపిస్తామని స్పష్టం చేశారు.