TG: మూసీ ప్రాజెక్టుకు భూసేకరణ, పునరావాసంపై మంత్రి పొంగులేటి సమీక్ష జరిపారు. మూసీ ప్రాజెక్టుతో ఎవరికీ అన్యాయం జరగనీయమని, మానవీయ కోణంలో భూసేకరణ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇళ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ఆదేశించారు. భూములు కోల్పోయే వారికి పరిహారం, పునరావాసంలో రాజీ ఉండదని పొంగులేటి స్పష్టం చేశారు.