దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఏపీ మంత్రులు నారాయణ, జనార్ధన్ రెడ్డి సియోల్లో ఇండియా ఎంబసీ, ఈడీబీ అధికారులతో కలిసి కియా మోటార్స్ హెడ్క్వార్టర్స్ను సందర్శించారు. కియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్తో సమావేశమై గ్లోబల్ మార్కెట్ అమ్మకాలు, ఏపీలో యూనిట్ విస్తరణపై చర్చించారు. పెట్టుబడిదారులకు లభించే అవకాశాలను వివరించి, నవంబర్లో విశాఖలో జరిగే పెట్టుబడిదారుల సదస్సుకు ఆహ్వానించారు.