TG: గురువారం ఉదయం మేడారం మహా జాతర ఏర్పాట్లను మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బైక్లపై తిరుగుతూ పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టిన ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా జంపన్న వాగు వద్ద భక్తుల స్నానాలకు కల్పించిన సౌకర్యాలను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జాతర నిర్వహణ సజావుగా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.