భారీ బడ్జెట్తో తెరకెక్కిన 'మిరాయ్' టికెట్ ధరలు పెంచబోమని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. ఎక్కువ మంది ప్రేక్షకులు చూడాలని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. శుక్రవారం విడుదల కానున్న ఈ చిత్రంలో తేజ సజ్జ హీరోగా, మంచు మనోజ్ విలన్గా, రితికా నాయక్ హీరోయిన్గా నటించగా, కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు.