
ఆర్బీఐ గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లపై మరో 0.25శాతం కోత
ఆర్బీఐ మరోసారి శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ఇప్పటికే వడ్డీ రేట్లపై ట్రిపుల్ బొనాంజా ప్రకటించిన ఆర్బీఐ.. మరోసారి కీలక వడ్డీరేట్లను మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగొచ్చింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. దీంతో బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లపై EMI తగ్గనుంది.




