బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్లో సీరియల్ నటి నందిని (24) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్లో ఆమె మనోవేదన బయటపడింది. ‘అమ్మా.. నన్ను క్షమించు. నాకు ప్రభుత్వ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. నా మాటలు ఎవరూ వినడం లేదు’ అని రాసుకొచ్చారు. దాంతో పాటు ఆరోగ్య సమస్యలు, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం మరణానికి కారణమని తెలిసింది. కాగా, నందిని తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. ఆయన మరణించడంతో ఆ ఉద్యోగం చేయాలని నందినిపై కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు.