AP: అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్టీసీ పెట్రోల్ బంక్లో రూ.65 లక్షల స్కాం బయటపడింది. డిసెంబర్ 7న ప్రారంభమైన ఈ బంక్లో సిబ్బంది సాంకేతిక లోపాలను ఆసరాగా తీసుకుని నిధులను గోల్మాల్ చేసినట్లు రాయచోటి డీపీటీఓ రాము విచారణలో తేలింది. డిపో మేనేజర్ ఫిర్యాదుతో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు పట్టణ సీఐ నాగార్జున 29 మందిపై కేసు నమోదు చేశారు.