మేషం, వృషభం, మిథునం, తుల, వృశ్చికం, మకరం రాశుల వారికి చంద్ర, రాహువుల కలయిక వల్ల ఆదాయం పెరిగే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఉద్యోగంలో పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల, వ్యాపారాల్లో రాబడితో పాటు షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల ద్వారా కూడా ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు పెంచుకోవడం, గృహ లాభం పొందడం, రావలసిన సొమ్ము చేతికి అందడం వంటి శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయని అంచనా.