సూడాన్లోని డార్సర్ నగరాన్ని ముట్టడించిన సూడాన్ పారామిలిటరీ దళాలు (ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్) వలస శిబిరంపై కాల్పులు జరిపాయి. ఈ దాడుల్లో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. డ్రోన్లు, ఫిరంగులతో దాడులు జరపగా, మృతుల్లో ఎక్కువగా చిన్నారులు, మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.