ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పోలీసులు డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో, మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మేకర్ మడ్డి అలియాస్ మధుసూదన్ రెడ్డిని బెంగళూరులో పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెకు చెందిన మడ్డి, తెలుగు రాష్ట్రాల్లోని యువతకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అతనిని ఏపీకి తరలించి విచారించే అవకాశాలున్నాయి.