
ఢిల్లీలో కేంద్రమంత్రి జయంత్ చౌదరితో మంత్రి లోకేశ్ భేటీ (వీడియో)
ఏపీ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి జయంత్ చౌదరితో భేటీ అయ్యారు. విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. త్వరలో కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్లతోనూ లోకేశ్ సమావేశమై విద్య, ఐటీ శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. అంతకుముందు ఆయన టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఎంపీలతో సమావేశమయ్యారు.




