
మనస్థాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న పదో తరగతి విద్యార్థి
కృష్ణా జిల్లా పామర్రు శివారు యడదిబ్బ గ్రామంలో పదో తరగతి విద్యార్థి కైలే యశ్వంత్ (15) ఆత్మహత్య చేసుకున్నాడు. పక్కింట్లో కుక్కను తరమడానికి వెళ్తే, ఇంట్లో రూ.1500 డబ్బులు తీశాడని నింద వేయడంతో మనస్థాపానికి గురై ఉరి వేసుకున్నాడు. డబ్బులు ఇచ్చేస్తామన్నా తీసుకోలేదని, ఇంట్లో ఏది పోయినా నీదే బాధ్యత అని బెదిరించడంతోనే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి రాజేశ్ ఆరోపించారు.




