
అనాథల సంరక్షణ కేంద్రంలో అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం
అల్జీరియా రాజధాని అల్జీర్స్లోని ఒక ఫోస్టర్ కేర్ హోమ్లో గురువారం అగ్నిప్రమాదం సంభవించి 11 మంది మరణించారు, మరో 19 మంది గాయపడ్డారు. తల్లిదండ్రుల సంరక్షణ లేని పిల్లలకు ఆశ్రయం కల్పించే ఈ సంస్థలో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది మూడు గంటలకు పైగా శ్రమించి, 10 ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను తరలించడానికి 16 అంబులెన్సులు అందుబాటులో ఉంచారు. ఇటీవల అధిక ఉష్ణోగ్రతల కారణంగా అల్జీరియాలో వేలాది అగ్నిప్రమాదాలు నమోదవుతున్నాయని అంతర్జాతీయ మీడియా నివేదించింది.




