TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్లో మార్పులు చేశారు. ఫిబ్రవరి 4 నుంచి సీఎం ప్రచార సభలు మొదలుకానున్నాయి. 4న మిర్యాలగూడ సభ, 5న కరీంనగర్ జిల్లా చొప్పదండి, 6న నిజామాబాద్ రూరల్ సభలలో పాల్గొంటారు. అలాగే 7వ తేదీన వికారాబాద్ జిల్లా పరిగి, 8న భూపాలపల్లిలో ప్రచారం నిర్వహిస్తారు. కాగా ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది.