విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలో దారుణం చోటుచేసుకుంది. నాగమణి అనే మహిళ తన భర్త సూరిబాబును చున్నీతో మెడ బిగించి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. వడదెబ్బతో అపస్మారక స్థితికి చేరాడని చెప్పి ఆసుపత్రికి తరలించగా, వైద్యుల అనుమానాస్పద గాయాలను గుర్తించడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్ట్ చేశారు. కుటుంబ కలహాలా లేక ఇన్సూరెన్స్ డబ్బుల కోసమా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.