నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలోని 11, 12 వార్డుల్లో ఇళ్లపై నుంచి వెళ్తున్న 33/11 కేవీ విద్యుత్ తీగలను వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ అలీతో ఫోన్ లో మాట్లాడిన ఆయన, ఏళ్ల తరబడి ప్రజలు ఎదుర్కొంటున్న ముప్పును వివరించి, ఈ ప్రమాదకర సమస్యను యుద్ధప్రతిపాదికన పరిష్కరించి, నివాసితులకు ఊరట కలిగించాలని కోరారు.