టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ ప్రమాణస్వీకారంలో మాట్లాడుతూ, అబద్ధాలు ఆడటంలో కేటీఆర్కు నోబెల్ బహుమతి ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.