Feb 20, 2026, 16:02 IST/అలంపూర్
అలంపూర్
మానవపాడులో కారు బోల్తా: రెవెన్యూ అధికారి కుటుంబం క్షేమం
Feb 20, 2026, 16:02 IST
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో ఓ కారు బోల్తా పడి ప్రమాదానికి గురైంది. కర్నూలు జిల్లా ఆత్మకూరులో బంధువుల వివాహానికి హాజరై తిరిగి సొంత ఊరు గద్వాలకు వస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఆయన కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. బోరవెల్లి స్టేజి సమీపంలో 44వ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. స్వల్పంగా గాయపడిన వారిని 108 అంబులెన్స్లో కర్నూలు తరలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.