గుర్రంపొడు మండలంలోని బుడ్డారెడ్డి గూడెం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయానికి పెద్దిరెడ్డి అంజిరెడ్డి రూ. 65,000 భారీ విరాళం అందించారు. సోమవారం ఆయన ఈ మొత్తాన్ని గుడి కమిటీ సభ్యులకు అందజేశారు. తన మాతృమూర్తి పెద్దిరెడ్డి పుష్పమ్మ జ్ఞాపకార్థం ఈ విరాళం ఇచ్చినట్లు అంజిరెడ్డి తెలిపారు. ఈ డబ్బును గర్భగుడి తలుపుల నిర్మాణం కోసం వినియోగించనున్నట్లు ఆయన వెల్లడించారు.