బుధవారం నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కోయిగూరోని బావి గ్రామ పంచాయితీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ముస్కు రాజ్యలక్ష్మి, ఉపసర్పంచ్ చింతరెడ్డి ఇందిర గోవర్ధన్ గ్రామ పంచాయితీ రోడ్లకు ఇరువైపులా కంప చెట్లను తొలగించే కార్యక్రమాన్ని తమ సొంత ఖర్చులతో చేపట్టారు. ఎంపీడీవో మహేష్ మాట్లాడుతూ, సర్పంచ్, ఉపసర్పంచ్ ల ఈ కార్యక్రమం అభినందనీయమని, గ్రామ పంచాయితీ అభివృద్ధికి ప్రభుత్వం తరపున సహకారం ఉంటుందని తెలిపారు.