వియత్నాంకు చెందిన బౌద్ధ భిక్షువులు నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించారు. వారు నాగార్జునకొండ మహాస్థూపం, మ్యూజియంలోని శిల్పాలను తిలకించి, మహాస్థూపం సమావేశ మందిరంలో లఘు చిత్రాన్ని వీక్షించారు. బుద్ధవనం సందర్శన తమకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని వారు తెలిపారు. వీరితో పాటు బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర కూడా ఉన్నారు.