చిట్యాలలో మంగళవారం జరిగిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎర్ర జెండా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఆయన ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేది ఎర్రజెండా మాత్రమే అన్నారు. దేశానికి ఎర్ర జెండా అవసరం అని ఎర్రజెండా బలహీన పడితే దేశ ప్రజలకే ప్రమాదం అన్నారు.