నల్గొండ జిల్లాలో మొంథా తుఫాను కారణంగా తడిసి, రంగు మారిన పత్తిని కొనుగోలు చేయడంలో నిబంధనలను సడలించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఆర్. జానయ్యకు మెమోరండం సమర్పించారు. నాణ్యత పేరుతో 12 శాతం తేమ ఉంటేనే మద్దతు ధర చెల్లిస్తామని అధికారులు అనడం సరికాదని ఆయన అన్నారు.