మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన దుర్గాప్రసాద్ అనే నిందితుడికి నార్కట్పల్లి పోక్సో కోర్టు గురువారం ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అత్యాచార యత్నానికి పాల్పడిన మాచర్లకు చెందిన దుర్గాప్రసాద్కు శిక్షతో పాటు రూ.4,000 జరిమానా కూడా విధించారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.