రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దాదాపు వంద మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, దీనికి సీఎం రేవంత్ రెడ్డియే కారణమని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ ఆరోపించారు. శుక్రవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యత వహించి విద్యారంగ సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.