నానో ఎరువుల ద్వారా సుస్థిర వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలని నల్గొండ కలెక్టర్ బి.చంద్రశేఖర్ వ్యవసాయ అధికారులకు సూచించారు. మంగళవారం తిప్పర్తి (M) దుప్పలపల్లి రైతు వేదికలో జరిగిన సాంకేతిక ప్రదర్శన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి, తద్వారా పంట దిగుబడిని పెంచుకోవచ్చని తెలిపారు.