అన్ని రంగాలలో అభివృద్ధి

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉద్దేశాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం నల్గొండ జిల్లా పరిషత్తు కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్ని రంగాలలో అభివృద్ధి, సంక్షేమాలను సాధించి, ప్రజలు సుభిక్షంగా ఉండేందుకే రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు.
