ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.