నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం సోమవారం తీవ్ర గందరగోళం మధ్య జరిగింది. తన వార్డు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 3వ డివిజన్ కార్పొరేటర్ పెరిక యాదయ్య బ్యానర్ ప్రదర్శించారు. ఆయన మాట్లాడుతుండగా
కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎదురుదాడికి దిగడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘర్షణతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.