మీర్పేట్లో భార్యను గొంతు కోసి భర్త దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. నల్గొండ జిల్లాకు చెందిన వసంత (52), నర్సింహ (60) దంపతులు బతుకుదెరువు కోసం BNరెడ్డి నగర్ సమీపంలో నివాసం ఉంటున్నారు. బుధవారం తెల్లవారుజామున నర్సింహ తన భార్య వసంతను కత్తితో తల నరికి హత్య చేశాడు. సమాచారం అందిన వెంటనే మీర్పేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.