గత నెల 22 నుండి వారం రోజుల పాటు గుజరాత్లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ యూనివర్సిటీలో నిర్వహించిన జాతీయ సమైక్యత శిబిరంలో నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి చెందిన ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్సరం విద్యార్థి కాట్రావత్ గణేశ్ ప్రతిభ కనబరిచి యూనివర్సిటీ ఖ్యాతిని పెంచాడు. రాష్ట్ర వర్సిటీల ప్రతినిధిగా ఎంపికైన గణేశ్, శిబిరంలో నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొని తన కళా సమర్థత, నాయకత్వ నైపుణ్యాలతో అందరినీ ఆకట్టుకున్నాడు.