రోడ్ల పనుల పురోగతి పై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

1చూసినవారు
రోడ్ల పనుల పురోగతి పై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
నల్గొండ జిల్లాలో రహదారులు, వంతెనల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయం 'ఇందిరాభవన్'లో ఆర్&బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుద్ధారం, అప్పాజిపేట, బ్రాహ్మణవెల్లంల రహదారి పనులను రెండు నెలల్లోగా పూర్తి చేయాలని, సోమనవాగుపై పగిడిమర్రి వంతెన పనులను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని మంత్రి నిర్దేశించారు.
Job Suitcase

Jobs near you