సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలతో ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయని నమ్మించి, నకిలీ సందేశాలు పంపుతున్నారు. నల్గొండలో, రూ.10,417 లేదా రూ.1,850 ఖాతాలో జమ అయ్యాయని, డబ్బులు తీసుకోవాలంటే లింక్ క్లిక్ చేయాలని సూచిస్తూ పలువురి మొబైల్ ఫోన్లకు సందేశాలు వచ్చాయి. ఈ లింకులను క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు.