నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం ఆయన ఎన్నికల మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ, మీడియా కేంద్రాన్ని ప్రారంభించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, హాలియా, చిట్యాల, చండూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.