నల్గొండ MGUలో ఏప్రిల్ 4న భారీ జాబ్ మేళా జరగనుంది. వర్సిటీ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆవిష్కరించారు. ఐటీ, ఫార్మా, అగ్రికల్చర్, బ్యాంకింగ్ రంగాల నుంచి 15 కంపెనీలు పాల్గొని, సుమారు 1500 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి.