నల్లగొండ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నందున, సబ్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు నల్గొండ విద్యుత్ ఏడీఈ వేణుగోపాల్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.