రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ, పీజీ, బీఈడీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కళాశాలల నిర్వధిక బంద్ మంగళవారం రెండో రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొనసాగింది. తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ యూనివర్సిటీ వద్ద ధర్నా నిర్వహించారు.