తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో సీటు పొందిన
విద్యార్థులు జూన్ 7వ తేదీలోపు కళాశాలలో అడ్మిషన్ తీసుకోవాలని జోనల్ అధికారి విద్యారాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే
ఫలితాలు విడుదలయ్యాయని, సీటు వచ్చిన వారు ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాలని ఆమె పేర్కొన్నారు.