నిడమనూర్ మండలం బంటువారిగూడెం గ్రామానికి చెందిన మెరుగు సోమమ్మ అనే మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. సమాచారం అందిన వెంటనే 108 సిబ్బంది యాదగిరి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం, ఆమెను మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.