నల్గొండలోని 39వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి దాసరి సాయి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, మద్దతుదారులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. వార్డు సమగ్ర అభివృద్ధి, పెండింగ్లో ఉన్న మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా బరిలోకి దిగుతున్నట్లు ఆయన వెల్లడించారు. కమలం గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు.