అలంపూర్ పట్టణంలో వెలిసిన 5వ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఉభయ ఆలయాలను జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి క్యాంపెయినర్ తనీష్ అల్లాడి దర్శించుకున్నారు. ఆలయ అధికారులచే ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయనతో పాటు జనసేన పార్టీ ఒకటో, ఐదో వార్డ్ అభ్యర్థులు కూడా ఉన్నారు. దర్శనం అనంతరం, ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.