మహబూబ్నగర్ జిల్లా, దేవరకద్ర నియోజకవర్గంలోని పెద్దాపురం మండలం 44వ జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద బుధవారం నుంచి నగదు చెల్లింపు కౌంటర్లను తొలగించారు. ఇకపై వాహనదారులు ఆన్లైన్ (ఫాస్ట్ట్యాగ్) ద్వారానే టోల్ చెల్లించాల్సి ఉంటుందని అందగాడి కార్తికేయ తెలిపారు. ఈ మార్పుతో నగదు రహిత చెల్లింపులు అమల్లోకి వచ్చాయి.