మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే 'ప్రజావాణి' కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ బిఎం. సంతోశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాతే ఈ కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ మార్పును గమనించాలని కలెక్టర్ సూచించారు.