జోగులాంబ గద్వాల జిల్లా రూరల్ మండలం పుటాన్ పల్లి శివారులో జిల్లా కోర్టు సముదాయాన్ని నిర్మించాలని PDSU, USFI, TNSF, PYL విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం విద్యార్థి సంఘాల నాయకులు కోర్టు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి, కక్షిదారులకు, న్యాయవాదులకు అనుకూలంగా ఉంటుందని, ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం, అధికారులు ఈ దిశగా చర్యలు చేపట్టాలని వారు కోరారు.